sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 12:32 pm Digital Edition : SATHYA VELUGU

ఇమామ్, మౌజన్‌లకు గుడ్ న్యూస్: రూ.45 కోట్ల గౌరవ వేతనాలు విడుదల

ముస్లిం మైనారిటీల పట్ల తమ నిబద్ధతను మరోసారి చాటుతూ N. Chandrababu Naidu కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమామ్‌లు, మౌజన్‌లకు సంబంధించిన గౌరవ వేతనాల కోసం రూ.45 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.

నిన్న రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో మాట్లాడిన సందర్భంగా సీఎం ఈ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాత్రికి రాత్రే నిధులు విడుదల చేయించడం విశేషంగా మారింది.

ఈ నిర్ణయం ద్వారా ముస్లిం మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వానికి ఉన్న కట్టుబాటు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.