వెంకటగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఆధునిక సమాచార సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి చేసిన విజ్ఞప్తికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. స్టేషన్లో చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న ఎలక్ట్రానిక్ కోచ్ గైడెన్స్, స్క్రోలింగ్ డిస్ప్లే బోర్డుల సమస్యను దక్షిణ కోస్తా రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ, వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన గుంతకల్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ చంద్ర శేఖర్ గుప్తా, ప్రస్తుతం...