ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. మాతృ-శిశు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా అర్హులైన కుటుంబాలు, దంపతులకు రూ.5,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల నుంచి ప్రతి జిల్లాలో మూడు జంటలను ఎంపిక చేసి ఒక్కో జంటకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తారు. అలాగే, ఒక బిడ్డ నుంచి మరో బిడ్డకు...