ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రూ.5,000 నగదు ప్రోత్సాహకం

Author

SATHYA VELUGU

Sr Reporter | ఎడిటోరియల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. మాతృ-శిశు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా అర్హులైన కుటుంబాలు, దంపతులకు రూ.5,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల నుంచి ప్రతి జిల్లాలో మూడు జంటలను ఎంపిక చేసి ఒక్కో జంటకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తారు. అలాగే, ఒక బిడ్డ నుంచి మరో బిడ్డకు...