నాయుడుపేటలోని ఇవాంజెలికల్ చర్చ్ ఆఫ్ ఇండియాలో పామ్ సండే సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు సురేష్ పాల్ గారు ప్రత్యేక వర్తమానాన్ని అందించారు. యేసుక్రీస్తు యెరూషలేములో విజయం తో ప్రవేశించిన సంఘటన ప్రాముఖ్యతను ఆయన విశ్వాసులకు వివరించారు.
ఈ సందర్భంగా చర్చ్లో ప్రార్థనలు, స్తోత్ర గీతాలు నిర్వహించగా, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగిన ఈ కార్యక్రమం విశ్వాసులకు ప్రత్యేక ఆశీర్వాదంగా నిలిచింది.