తప్పుడు బోధనలపై పరిశోధనకు కే. జగన్ మోహన్‌రావుకు పీహెచ్‌డీ అవార్డు

Author

KUMPATI SURESH

Sr Reporter | తిరుపతి

నాయుడుపేట: “పరిశుద్ధ బైబిలుకు విరుద్ధమైన తప్పుడు బోధనలు” అనే అంశంపై పరిశోధన చేసిన కే. జగన్ మోహన్‌రావుకు WORD Bible College ఆధ్వర్యంలో పీహెచ్‌డీ అవార్డు ప్రదానం చేశారు. పరిశుద్ధ బైబిల్ బోధనలకు విరుద్ధంగా ఉన్న వివిధ తప్పుడు బోధనలను పరిశీలిస్తూ, బైబిల్ ఆధారంగా సత్యబోధనను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ఆయన పరిశోధన నిర్వహించారు. నాయుడుపేటలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయగా, పలువురు కే. జగన్ మోహన్‌రావును అభినందించారు.