నెల్లూరు, ఆగస్టు 20: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్పై నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. దళిత క్రైస్తవుల సామాజిక, విద్యా, ఉద్యోగ హక్కులు మరియు రాజ్యాంగ పరిరక్షణలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ సమావేశం ఆగస్టు 21, 2026 శుక్రవారం ఉదయం 10 గంటలకు నెల్లూరులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్, కొండాయపాళెం గేట్ సెంటర్లో జరగనుంది. ప్రజాసంఘాలు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, మేధావులు, న్యాయవాదులు మరియు సంబంధిత వర్గాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం...