తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి నిరంతరం కృషి చేస్తున్నారు. తిరుపతిలోని తన కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చే ప్రజలను స్వయంగా కలిసి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, సమస్యల పరిష్కార ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. తన కార్యాలయంలో...