న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతా నుంచి పొరపాటున డబ్బులు డెబిట్ కావడం, యూపీఐ (UPI) లావాదేవీలు విఫలం కావడం, ఏటీఎం నుంచి నగదు రాకపోయినా ఖాతాలో నుంచి మొత్తం కట్ కావడం వంటి సమస్యలు ఎదురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేస్తోంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం RBI Integrated Ombudsman Scheme ద్వారా ఖాతాదారులు ఉచితంగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ ఖాతా నుంచి ₹1 అయినా లేదా పెద్ద మొత్తం అయినా...