sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 11:36 pm Digital Edition : KUMPATI SURESH

యేసుక్రీస్తు ఉనికిపై పరిశోధనకు కుంపటి సురేష్ పాల్‌కు పీహెచ్‌డీ అవార్డు

నాయుడుపేట: “పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఉనికి” అనే అంశంపై సమగ్ర పరిశోధన చేసిన కుంపటి సురేష్ పాల్‌కు WORD బైబిల్ కాలేజ్, హైదరాబాద్ వారు పీహెచ్‌డీ అవార్డు ప్రదానం చేశారు. బైబిల్‌లో క్రీస్తు ఉనికి, పాత నిబంధన ప్రవచనాలు, క్రొత్త నిబంధనలో వాటి నెరవేర్పుపై ఆయన పరిశోధన చేశారు. నాయుడుపేట లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రెవ. డాక్టర్ నోవా, ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ సౌదా మణి, స్టేట్ కోఆర్డినేటర్ రెవ. డాక్టర్ నరేష్ తదితరుల సమక్షంలో ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సురేష్ పాల్‌ను అభినందించారు.