న్యూఢిల్లీ: ప్రధాని విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి జరిగిన వ్యయంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వివరాలు వెల్లడించింది. 2021 నుంచి ప్రధాని విదేశీ పర్యటనల కోసం మొత్తం రూ.550 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిపింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, 2025లో ఇప్పటివరకు 23 విదేశీ పర్యటనలు నిర్వహించగా, వాటికి సంబంధించిన విమానాల నిర్వహణ, ప్రయాణ ఏర్పాట్ల కోసం రూ.187 కోట్ల వరకు వ్యయం జరిగినట్లు పేర్కొంది. అలాగే, 2021 నుంచి ఇప్పటివరకు...