sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 9:57 pm Digital Edition : KUMPATI SURESH

రేపు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం

ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం

రేపు (25.08.2026, మంగళవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్‌, అనుబంధ విభాగాలు), స్టేట్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలు పాల్గొననున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.

ఈ అంశాలపై పార్టీ నాయకులకు శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.