sathyavelugu.com
Date of Publish : 16 September 2026, 7:20 pm Posted by : KUMPATI SURESH

28 జిల్లాల ఉద్యోగుల సదస్సు రేపు విజయవాడలో

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో 28 జిల్లాల ప్రత్యేక సదస్సు విజయవాడలో గురువారం జరగనుంది. సెప్టెంబర్ 17న ఉదయం 10 గంటలకు UTF భవన్‌లో సదస్సు నిర్వహించనున్నారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై సదస్సులో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలను ప్రస్తావించనున్నారు.