ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు.. ప్రపంచం చూపు భారత్పైనే
న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచంలో కొనసాగుతున్న యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య సవాళ్ల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సాంకేతికత తదితర అంశాలపై చర్చించారు. భారత్–రష్యా వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంపైనా దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగా, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఏడేళ్ల తర్వాత భారత్లో పర్యటిస్తున్నారు. గాల్వాన్ ఘర్షణల...