sathyavelugu.com
Date of Publish : 18 September 2026, 6:25 pm Posted by : KUMPATI SURESH

సేంద్రియ, జీవన ఎరువులతో అధిక దిగుబడులు

బెల్లంకొండ: సేంద్రియ, జీవన ఎరువుల వినియోగంతో భూసారం పెరగడంతో పాటు సాగు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని నరసరావుపేట ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. నగేష్, డాక్టర్ పి.వి. సత్య గోపాల్ తెలిపారు. బెల్లంకొండలో కంది పంట క్షేత్ర సందర్శనలో భాగంగా రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్నినో పరిస్థితుల్లో కంది, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పత్తి, మిరప పంటల్లో తెగుళ్లు, పురుగుల నివారణకు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.