కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుదాం: కాకాణి

నెల్లూరు, సెప్టెంబర్‌ 12: రాబోయే స్థానిక సంస్థలు, నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఐక్యంగా పోరాడి విజయం సాధించాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ కన్వెన్షన్‌ హాల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నెల్లూరు నగర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నాయకులకు గుర్తింపు కార్డులను అందజేశారు. రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 72 సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలవాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ అంతర్గత విభేదాలను...