sathyavelugu.com
Date of Publish : 18 September 2026, 7:15 pm Posted by : KUMPATI SURESH

RTI సమాచారంపై అధికారుల నిర్లక్ష్యం: జైభీమ్ సుధాకర్

సత్యసాయి జిల్లా, సోమందేపల్లి: సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు చేసినప్పటికీ కోరిన సమాచారం అందలేదని Human Rights Protection Council of People (HRPCP) జాతీయ వైస్ యూత్ ప్రెసిడెంట్ జైభీమ్ సుధాకర్ ఆరోపించారు.

సోమందేపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు సంబంధించి లైసెన్సులు, వ్యాపారాలపై చర్యలు, హౌస్ ట్యాక్స్, ఉద్యోగుల ఐడీల తదితర వివరాలను సెప్టెంబర్ 5న RTI సెక్షన్ 6(1) కింద కోరినట్లు తెలిపారు. పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో అప్పిలేట్ అధికారిని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

RTI దరఖాస్తులకు నిబంధనల ప్రకారం సమాచారం అందించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జైభీమ్ సుధాకర్ డిమాండ్ చేశారు.