sathyavelugu.com
Date of Publish : 04 September 2026, 2:52 pm Posted by : KUMPATI SURESH

పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్

విజయవాడ: డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (Dr. NTR UHS) 2026–27 విద్యా సంవత్సరానికి పోస్ట్‌ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్‌) రెండేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్‌ 3న నోటిఫికేషన్‌, ప్రాస్పెక్టస్‌ను అందుబాటులో ఉంచింది.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. దరఖాస్తు సమయంలో అవసరమైన అసలు ధ్రువపత్రాల స్కాన్‌ కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నర్సింగ్‌ కళాశాలల్లో సమర్థ అధికారుల కోటా కింద అందుబాటులో ఉన్న సీట్లకు ఈ ప్రవేశాలు నిర్వహించనున్నారు.

దరఖాస్తు గడువు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్‌ 4, 2026 ఉదయం 11 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్‌ 15, 2026 సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.

అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఫీజు తదితర పూర్తి వివరాలను ప్రాస్పెక్టస్‌లో పరిశీలించాలి.

అధికారిక వెబ్‌సైట్: drntr.uhsap.in

సత్య వెలుగు న్యూస్ | విద్యా సమాచారం