sathyavelugu.com
Date of Publish : 18 September 2026, 10:48 pm Posted by : KUMPATI SURESH

వెలుగులు పునరుద్ధరించిన మున్సిపల్‌ సిబ్బంది

నాయుడుపేట, సెప్టెంబర్‌ 18 (సత్య వెలుగు న్యూస్‌):

నాయుడుపేట బస్టాండ్‌ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో సెంటర్‌ లైట్లు పనిచేయక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై సత్య వెలుగు న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్‌ సిబ్బంది స్పందించారు. సంబంధిత లైట్లను పరిశీలించి మరమ్మతులు చేపట్టి, తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. దీంతో మార్గంలో వెలుగులు పునరుద్ధరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించిన మున్సిపల్‌ అధికారులకు, ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చిన సత్య వెలుగు న్యూస్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.