దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) సేవలను మరింత సులభతరం చేస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.
•మార్చి 25 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కానుంది.
•మార్చి 30 నుంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ ప్రక్రియ ద్వారా దివ్యాంగుల వైకల్యాన్ని అధికారికంగా గుర్తించి, వారికి అవసరమైన సేవలు అందించనున్నారు.
డిజిటల్ సర్టిఫికెట్ జారీ
ఇకపై దివ్యాంగులకు డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. దీని ద్వారా ప్రభుత్వ పథకాలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది.
పింఛన్ & ఇతర ప్రయోజనాలు
•40% పైగా వైకల్యం ఉన్నవారికి పింఛన్ అవకాశం
• ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత
•ఇతర సంక్షేమ ప్రయోజనాలు
ఉచిత బస్సు ప్రయాణం
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

