📄 ePaper
Thursday, September 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ప్రజా సంక్షేమానికి వైఎస్సార్‌ చేసిన సేవలు చిరస్మరణీయం: సీఎం...

వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ప్రజా సంక్షేమానికి వైఎస్సార్‌ చేసిన సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకుని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో వైఎస్సార్‌ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తుచేశారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్సార్‌ రైతులకు ఉచిత విద్యుత్‌ అందించే నిర్ణయం తీసుకుని వ్యవసాయ రంగానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది కుటుంబాలకు వైద్య భరోసా కల్పించారని తెలిపారు.

అలాగే పేదల కోసం గృహ నిర్మాణం, విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పడేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను అమలు చేసి సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్సార్‌ పాలన ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయని పేర్కొంటూ మహానేతకు ఘన నివాళులు అర్పించారు.

సత్య వెలుగు న్యూస్ | జాతీయ తెలుగు దినపత్రిక
సత్యం • సమాజం • సేవ

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!