📄 ePaper
Saturday, March 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
HomeEducationNotificationsపి.ఎం. శ్రీ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

పి.ఎం. శ్రీ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా చల్లమానుచేను, ఓజిలి మండలంలో ఉన్న *పి.ఎం. శ్రీ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు)*లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
అందప్రదేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ గురుకుల పాఠశాలలో 5వ, 6వ, 7వ తరగతులు మరియు 8వ తరగతిల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటించారు.
ముఖ్య వివరాలు
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2024–25 లేదా 2025–26 విద్యాసంవత్సరంలో తిరుపతి, నెల్లూరు జిల్లాలలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో చదువుతూ ఉండాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,50,000/- లోపు ఉండాలి.
ఎంపికైన విద్యార్థులకు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాం మరియు ఇతర సౌకర్యాలు ఉచితంగా అందిస్తారు.
చదువుతో పాటు డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్, PAL ల్యాబ్, క్రీడా సదుపాయాలు వంటి ఆధునిక సౌకర్యాలు కూడా పాఠశాలలో ఉన్నాయి.
విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఎంపిక విధానం
విద్యార్థుల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apcfss.in� ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పాఠశాలలో లభించే సౌకర్యాలు
1.ఉచిత విద్య, వసతి
2.పోషకాహార భోజనం
3.పుస్తకాలు, యూనిఫామ్
4.క్రీడలు మరియు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు
5.టెక్ బేస్డ్ లెర్నింగ్ సదుపాయాలు
అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని గురుకుల విద్యా వ్యవస్థలో చేరాలని పాఠశాల అధికారులు సూచించారు.
సంప్రదించవలసిన వారు:
ప్రిన్సిపాల్ – జి. సురేష్ (M.A., B.Ed.)
సెల్: 87126 25050, 96525 97976, 93816 38609.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!