పుంగనూరు, సెప్టెంబర్ 13 (సత్య వెలుగు న్యూస్): తమిళనాడు గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల జన్మదినాన్ని పురస్కరించుకుని పుంగనూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఎస్కే వెంకటరమణారెడ్డి, మాదిరాజు లక్ష్మణ రాజు (పతిరాజు) శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్లోని నల్లారి సోదరుల నివాసానికి వెళ్లిన నాయకులు వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నల్లారి సోదరులు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రానికి అందించిన సేవలను నాయకులు కొనియాడారు. ప్రజా సేవలో వారు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పుంగనూరు నియోజకవర్గంలో భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరగాలని వారు కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన పలువురు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నల్లారి సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.


