📄 ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅమరావతివాట్సాప్‌లోనే సదరం సేవలు.. స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్‌కు ఏపీ ప్రభుత్వ కొత్త సౌకర్యం

వాట్సాప్‌లోనే సదరం సేవలు.. స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్‌కు ఏపీ ప్రభుత్వ కొత్త సౌకర్యం

📰 Generate e-Paper Clip

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత ప్రజలకు చేరువ చేస్తూ మరో కీలక సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దివ్యాంగుల కోసం అత్యంత ముఖ్యమైన సదరం (SADARAM) సేవలను ఇప్పుడు మనమిత్ర (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ వేదిక ద్వారా అందిస్తోంది. దీంతో సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్ వంటి సేవలను ఇంటి నుంచే మొబైల్ ద్వారా సులభంగా పొందే అవకాశం కల్పించింది.

కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు

ఇప్పటి వరకు సదరం సేవల కోసం మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది. స్లాట్ బుకింగ్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. తాజా నిర్ణయంతో ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా మార్చి, వాట్సాప్ ద్వారానే సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.

వాట్సాప్‌లో ఎలా సేవలు పొందాలి?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ఈ సేవలను మనమిత్ర ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించింది.

సేవలు పొందేందుకు ఈ దశలను అనుసరించాలి:

  • 9552300009 నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.
  • ఆ నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపాలి.
  • కనిపించే Citizen Services విభాగాన్ని ఎంచుకోవాలి.
  • అక్కడ Sadaram Services పై క్లిక్ చేయాలి.

అందుబాటులో ఉన్న సేవలు

సదరం సేవల విభాగంలో ప్రస్తుతం మూడు ప్రధాన సేవలు అందుబాటులో ఉన్నాయి.

  • Slot Availability – స్లాట్‌ల లభ్యత తెలుసుకోవడం
  • Slot Booking – అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవడం
  • Certificate Download – ఇప్పటికే జారీ అయిన సదరం సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం

సమయం, ఖర్చు రెండింటిలోనూ ఆదా

ఇప్పటికే సదరం సర్టిఫికెట్ కలిగిన వారు కూడా వాట్సాప్ ద్వారానే నేరుగా తమ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం, ప్రయాణ ఖర్చు రెండూ ఆదా అవుతాయి.

మధ్యవర్తుల అవసరం లేకుండా సేవలు

ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులే నేరుగా సేవలను పొందే అవకాశం కల్పించడం వల్ల దివ్యాంగులకు మరింత సౌకర్యం కలగనుంది.

డిజిటల్ సేవల విస్తరణపై ప్రభుత్వం దృష్టి

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో వరుసగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు సదరం సేవలు కూడా అదే వేదికపై అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!